చీమ కుట్టడం వంటి చిన్నచిన్న సంఘటనలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తున్నారంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. జాదవ్పూర్ యూనివర్శిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అందర్నీ కలుపుకొని వెళ్తామని ఓవైపు చెబుతూనే, విపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని, చీమ కాటు వేసినా కూడా ఈడీ, సీబీఐలకు దర్యాప్తు అప్పగిస్తు్న్నారని అన్నారు. అకారణంగా తమ ప్రజలను కేంద్ర ఏజెన్సీలు టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. జాదవ్పూర్ యూనివర్శిటీలో విద్యార్థి ఆత్మహత్యపై మాట్లాడుతూ, ఈ ఘటనతో వెంటనే తాము అప్రమత్తమయ్యాయని, ర్యాగింగ్కు అడ్డుకట్ట వేసేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లోనూ యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్ ప్రారంభించినట్టు తెలిపారు.
Post Top Ad
adg
Tuesday, 22 August 2023
Home
National
westbengal
చీమ కుట్టినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు !
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
విపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని
చీమ కుట్టినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు !
చీమ కుట్టినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు !
Tags
# National
# westbengal
# చీమ కుట్టినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు !
# పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
# విపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని
About Telugu Lo Computer
విపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని
Tags
National,
westbengal,
చీమ కుట్టినా కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు !,
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ,
విపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తున్నారని
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment