ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Telugu Lo Computer
0


ర్ణాటకలోని  మైసూరు పరిధిలోని చామండిపురానికి చెందిన మహాదేవస్వామి (45) తన భార్య అనిత (38), కూతుళ్లు చంద్రకళ (17), ధనలక్ష్మి (15)తో కలిసి ఉంటున్నాడు. మహాదేవస్వామి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మహాదేవస్వామి ఉంటున్న ఇంటి తలుపులు రెండు రోజుల నుంచి తెరవకపోవడంతో  స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా, నలుగురు కూడా చనిపోయి ఉన్నారు. చంద్రకళ ఉరేసుకుని ఉండగా, మిగతా ముగ్గురు కిందపడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహాదేవస్వామి ఈ ఇంట్లో గత రెండు నెలల నుంచి కిరాయికి ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)