మాజీ ప్రియురాలిపై పలుమార్లు అత్యాచారం

Telugu Lo Computer
0


బెంగళూరులో తనతో ఉన్న సన్నిహిత వీడియోలతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి మాజీ ప్రియురాలిపై ఓ యుకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి ఆగకుండా ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆమెను తన స్నేహితుల దగ్గరకు కూడా పంపి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యారణ్యపురకు చెందిన ఆండీ జార్జ్ (28) అనే యువకుడు ఒక స్కూల్ లో డ్యాన్స్ టీచర్ గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జార్జ్ కు ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది.  ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు తరచూ కలుసుకుంటూవుండేవారు. అయితే, జార్జ్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆమె దూరం పెట్టింది. కాగా, తనతో ఆమె సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి ఆమెను బెదిరించాడు. ఆ విధంగా ఆమెపై జార్జ్ పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే జార్జ్ ఆగడాలు అంతటితో ఆగలేదు. తన స్నేహితులైన సంతోష్, శశికుమార్ వద్ద కూడా సన్నిహితంగా ఉండాలని ఆమెను కోరాడు. కానీ అందుకు యువతి ఒప్పుకోలేదు. దీంతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి ఆమెను ఒప్పించాడు. అతని స్నేహితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో కూడా వీడియోలను రికార్డు చేశాడు. స్నేహితుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ఆ ముగ్గురి ప్రవర్తన నచ్చక ఆమె వారిని కలవడం మానేశారు. దీంతో వీడియోలు, ఫొటోలను జార్జ్ తన స్నేహితులకు షేర్ చేశాడు. జార్జ్ వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జార్జ్ ను అరెస్టు చేసి అతని నుంచి ల్యాప్ టాప్, ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)