రాజస్థాన్​లో వింత శిశువు జననం !

Telugu Lo Computer
0


రాజస్థాన్​లోని అల్వార్​ జిల్లాకు చెందిన ఓ మహిళ జులై 31 అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ ముఖంపై వినాయకుడి తొండంలాంటిది ఉంది. ఈ వార్త కాస్తా ఆ నోటా ఈ నోటా చేరడంతో వైరల్​ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వింత చూసేందుకు జనం ఎగబడ్డారు. అయితే 20 నిమిషాల తరువాత బాబు చనిపోయాడు. ఇదే విషయాన్ని డాక్టర్ల వద్ద ప్రస్తావించగా  జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ శిశువులు జన్మిస్తారని తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్​ చెకప్​లు చేయించోవాలని వారు సూచిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)