రాజస్థాన్లోని అల్వార్ జిల్లాకు చెందిన ఓ మహిళ జులై 31 అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ ముఖంపై వినాయకుడి తొండంలాంటిది ఉంది. ఈ వార్త కాస్తా ఆ నోటా ఈ నోటా చేరడంతో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వింత చూసేందుకు జనం ఎగబడ్డారు. అయితే 20 నిమిషాల తరువాత బాబు చనిపోయాడు. ఇదే విషయాన్ని డాక్టర్ల వద్ద ప్రస్తావించగా జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ శిశువులు జన్మిస్తారని తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్ చెకప్లు చేయించోవాలని వారు సూచిస్తున్నారు.
రాజస్థాన్లో వింత శిశువు జననం !
August 02, 2023
0
Tags