విక్రమ్ ల్యాండర్‌ని డిజైన్ చేశాను ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 August 2023

విక్రమ్ ల్యాండర్‌ని డిజైన్ చేశాను !


గుజరాత్ లోని సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడమే ఆలస్యం, వెంటనే సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. తాను ఇస్రోలో పని చేస్తున్నానని ఒక ఫేక్ స్టోరీని అల్లేశాడు. తాను చంద్రయాన్-3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నానని, విక్రమ్ ల్యాండర్‌ని తానే డిజైన్ చేశానని చెప్పుకున్నాడు. అతడిలా తప్పుడు ప్రచారం చేయడమే ఆలస్యం, స్థానిక మీడియా అతని ముందు వాలిపోయింది. అతని ఇంటర్వ్యూలు తీసుకుంది. దాంతో అతడు ఇంకా ఉప్పొంగిపోయి  తన అబద్ధాలకు మరింత మసాలా జోడించేశాడు. దీంతో అతడు చెప్తున్న మాటలు నిజమేనా? కాదా? అనేది ధృవీకరించడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో.. అతడు చెప్పిందంతా అబద్ధమని తేటతెల్లమైంది. పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా తాను ఇస్రోలో పని చేసినట్టుగా మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. కేవలం చంద్రయాన్-3 సక్సెస్ క్రెడిట్ కొట్టేయడం కోసమే అతడు ఈ అబద్ధపు ప్రచారానికి తెరలేపాడని వెల్లడైంది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ అందుకు సంబంధించి ఆధారాలేమీ లేవని సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ తెలిపారు. తనకు పీహెచ్‌డీ ఉందని మితుల్ చెప్పుకోవడం కూడా అబద్ధమేనని, అతనికి కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉందని చెప్పారు. నాసాకు ఫ్రీలాన్సర్‌గా పని చేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్‌లో భాగమేనని వెల్లడించారు. తమ దర్యాప్తులో మితుల్ ఇస్రో సైంటిస్ట్ కాదని తేలిందని, అతడ్ని మరోమారు ప్రశ్నించబోతున్నామని కమీషనర్ వెల్లడించారు.

No comments:

Post a Comment