దేశంలో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,552గా ఉందని చెప్పింది. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4.49 కోట్లు గా ఉందని చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,44,62,510గా ఉందని పేర్కొంది. నేషనల్ రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు పేర్కొంది.
దేశంలో కొత్తగా 47 కరోనా కేసులు నమోదు
August 06, 2023
0