కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆగస్టు 12, 13 తేదీల్లో వయనాడ్లో పర్యటిస్తారని, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. తిరిగి ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన. రాహుల్ గాంధీ ‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై 2019 పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే విధించిన కొద్ది రోజుల తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరించబడింది. లోక్సభ సభ్యుడిగా రాహుల్ గాంధీ అనర్హత వేటును రద్దు చేస్తున్నట్లు లోక్సభ సచివాలయం నోటిఫికేషన్లో పేర్కొంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కేరళ కాంగ్రెస్ ఆయనకు ఘన స్వాగతం పలకనుంది. రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ట్విట్టర్లో ఇలా వ్రాస్తూ, “ఆగస్టు 12-13 తేదీలలో రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్లో పర్యటిస్తారు. వయనాడ్ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచిందని, వారి గొంతు పార్లమెంటుకు తిరిగి వచ్చిందని ఉప్పొంగిపోతున్నారు. ! రాహుల్ జీ కేవలం ఎంపీ మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుడు.” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
12, 13 తేదీల్లో వయనాడ్లో రాహుల్ పర్యటన !
August 08, 2023
0
Tags