బెంగళూర్కు చెందిన ఓ టీ విక్రేత ఇటీవల గోవా క్యాసినోలో రూ. 10 లక్షల జాక్పాట్ కొట్టాడు. త్యాగరాజనగర్కు చెందిన తిలక్ మణికంఠ (32) ఈ నెల 1న లాటరీలో పెద్ద మొత్తం గెలుచుకున్నాడు. ఈ డబ్బుతో తన కలల వ్యాపారమైన హోటల్ను ప్రారంభించాలని భావించాడు. అయితే మణికంఠ కలలను అతడి స్నేహితులే చిదిమేశారు. లాటరీ విషయం తెలిసిన మణికంఠ ఫ్రెండ్స్కు కన్నుకుట్టి భారీ స్కెచ్కు తెరలేపారు. జాక్పాట్ దక్కిన నాలుగు రోజుల తర్వాత ఆగస్ట్ 5న అతడిని అపహరించిన ఫ్రెండ్స్ మణికంఠ నుంచి రూ. 15 లక్షలు కొట్టేశారు. జాక్పాట్ విషయం తెలిసిన తాను ఎవరికీ చెప్పలేదని ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదని మణికంఠ చెప్పుకొచ్చాడు. అయితే ఈనెల 5న తాను బేకరి సమీపంలో టీ తాగుతుండగా కొందరు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని జ్జ్ఞానభారతి వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారని, తన బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 25 లక్షలు ఉండటం చెక్ చేసిన నిందితులు తనను కొబ్బరి చెట్టుకు కట్టేసి కొట్టారని, బలవంతంగా రూ. 15 లక్షలను వారి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని వాపోయాడు. మరుసటి రోజు ఉదయం తనను బెంగళూర్లో విడిచిపెట్టి వెళుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని చెప్పాడు. మణికంఠ ఫిర్యాదు ఆధారంగా నిందితులు కార్తీక్, పండు, ఈశ్వర్, నిశ్చల్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై హనుమంతనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రూ. 10 లక్షల జాక్పాట్ కొట్టిన ఛాయ్వాలాను కిడ్నాప్ చేసిన స్నేహితులు !
August 11, 2023
0
Tags