సాయి ధరమ్ తేజ్‌ను కాపాడిన అబ్దుల్‌ను గుండెల్లో పెట్టుకుంటా !

Telugu Lo Computer
0

                                                        

సాయి ధరమ్ తేజ్‌ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కొన్నిరోజుల పాటు కోమాలోకి కూడా వెళ్లిపోయాడు. యాక్సిడెంట్‌ తాలూకూ ప్రభావం ఇప్పటికీ తేజ్‌లో కనిపిస్తోంది. అందుకే మళ్లీ సర్జరీకి వెళుతున్నాడు. ఈ క్రమంలో యాక్సిడెంట్‌ సమయంలో తేజ్ పరిస్థితిని గుర్తుచేసుకుని ఎమోషనల్‌ అయ్యారు పవన్‌ కల్యాణ్‌. తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన పవన్‌ తన మేనల్లుడు కోమాలో ఉన్నప్పుడు తల్లడిల్లిపోయానన్నారు. ‘నేను, త్రివిక్రమ్‌ ఉన్నప్పుడు తేజ్‌కు యాక్సిడెంట్‌ అయిందని ఫోన్‌ వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూశాను. అక్కడ సాయి స్పృహలో లేడు. కోమాలోకి వెళ్లిపోయాడు. 24 గంటల తర్వాత మళ్లీ స్పృహలోకి వస్తాడన్నారు వైద్యులు. కానీ ఎంతకూ రాలేదు. అప్పుడు ఆస్పత్రిలో ఓ మూలన కూర్చొని నాలో నేనే గుండెపగిలేలా రోధించాను. తేజ్‌ను బతికించమని జగన్మాత అమ్మవారిని ప్రార్థించాను. అలాంటి తేజ్‌ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడంటే ఆరోజు అతనిని ఆస్పత్రిలో చేర్చిన అబ్బాయే ( అబ్దుల్‌) కారణం. తేజ్ ను ఆస్పత్రిలో చేర్చిన అబ్దుల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అతను ఎప్పటికీ నా గుండెల్లో ఉంటాడు’ అని ఎమోషనల్‌ అయ్యారు పవన్‌ కల్యాణ్‌. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)