అశోక్ గెహ్లాట్ తో సచిన్ పైలట్ రాజీ !

Telugu Lo Computer
0


రాజస్తాన్ కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా విడిపోయి పోట్లాడుకుంటున్న అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు అధిష్టానం చొరవ చూపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వారం క్రితం అసంతృప్త నేత సచిన్ పైలట్ ను పిలిపించుకుని మాట్లాడారు. గెహ్లాట్ తో రాజీపడితే భవిష్యత్తును తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పైలట్ చల్లబడ్డారు. అధిష్టానంతో వారం రోజుల క్రితం జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో సచిన్ పైలట్ ఇవాళ సోషల్ మీడియా స్టేటస్ మార్చారు. క్షమిస్తున్నా, మర్చిపోతున్నా అంటూ పైలట్ ఇవాళ పెట్టిన స్టేటస్ చూస్తే అది గెహ్లాట్ ను ఉద్దేశించేననే చర్చ జరుగుతోంది. తద్వారా గెహ్లాట్ తో పాత గొడవల్ని మర్చిపోయి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పైలట్ సంకేతాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ లో మరోసారి కలిసి పోరాడేందుకు మార్గం సుగమమైంది. గెహ్లాట్ తో విభేదాల కారణంగా కొంతకాలంగా సచిన్ పైలట్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెంచుతున్నారు.బీజేపీ నేత వసుంధరారాజే సింధియా అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబడుతూ దీక్షలు కూడా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి రాజస్తాన్ లో అధికారం సాధించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)