బాలికను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బండాలో బాలికను ఒక యువకుడు కిడ్నాప్‌ చేశాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ బాలికకు అతడితో బలవంతంగా పెళ్లి జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ పెళ్లిని అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్‌ చేశారు. జూన్‌ 30న 11 ఏళ్ల బాలికను 19 ఏళ్ల సాహిల్‌ కిడ్నాప్‌ చేశాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం బాధిత బాలికను ఆ యువకుడితో బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్వర్‌ అనే వ్యక్తి ఇంటిపై రైడ్‌ చేశారు. బలవంతపు పెళ్లిని అడ్డుకున్నారు. బాధిత బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. నిందితుడు సాహిల్‌తోపాటు మరో 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)