ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లోని లీలాపూర్లో సోమవారం గ్యాస్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ టెంపో వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. పలువురు గాయపడ్డారు. ట్యాంకర్ బోల్తాపడడంతో గ్యాస్ లీక్కావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. లీలాపూర్ వద్ద టెంపో ప్రతాప్గఢ్ వైపు వెళ్తుండగా.. ట్యాంకర్ మోహన్గంజ్ వైపు వస్తున్నది. వేగంగా వచ్చిన ట్యాంకర్ టెంపోను ఢీకొట్టింది. టెంపోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టెంపోను ఢీకొట్టిన అనంతరం గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. గ్యాస్ లీక్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ లీకేజీతో ఒక్కసారిగా సంఘటనా స్థలంలో కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదని, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon
టెంపోను ఢీకొట్టిన ట్యాంకర్ ఘటనలో ఎనిమిది మంది మృతి
July 10, 2023
0
Tags