ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు !
July 01, 2023
0
ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, టీవీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్స్, వాషింగ్ మెషిన్ సహా అనేక గృహోపకరణాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గూడ్స్ పై 31.1 శాతం జీఎస్టీ ఉండగా, దాన్ని 18 శాతానికి తగ్గించింది. ఏయే వస్తువుపై ఎంత ధర తగ్గుతుందనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 27 అంగుళాలకన్నా ఎక్కువున్న టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్, మిక్సర్, జ్యూజర్, వాక్యూమ్ క్లీనర్, గీజర్, ఫ్యాన్, కూలర్, ఎల్పీజీ స్టవ్, ఎల్ఈడీ బల్బులు, కుట్టు మెషిన్లు, యూపీఎస్ లు, కిరీసిన్ ల్యాంతర్లు, వ్యాక్యూమ్ ఫ్లాస్క్, వ్యాక్యూమ్ వెస్సల్స్, మొబైల్ ఫోన్స్ పై జీఎస్టీ తగ్గుతుంది. https://t.me/offerbazaramzon
Tags