జమ్మూకాశ్మీర్ లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 4.9గా నమోదు అయ్యింది. దోడా జిల్లాలో ఉదయం 5.38 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో సోమవారం భూమి కంపించింది. దీని లాట్: 33.15, పొడవు: 75.68, లోతు: 10 కిలో మీటర్లుగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం రాత్రి 5.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.39 గంటలకు 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అలాగే ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో ఆదివారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్డీఎస్) తెలిపింది. 54.2 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 5.354 డిగ్రీలు, 94.569 డిగ్రీలుగా నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది. https://t.me/offerbazaramzon
జమ్మూలో 4.9 తీవ్రతతో భూకంపం
July 10, 2023
0
Tags