ట్రాన్స్‌ఫారమ్‌ పేలి 15 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లో అలకనంద నది చమోలి డ్యామ్‌ దగ్గర ట్రాన్స్‌ఫారమ్‌ పేలిన ఘటనలో పదిహేను మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి.. బ్రిడ్జి గుండా కరెంట్‌ పాస్‌ అయ్యింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవాళ్లకు కరెంట్‌ షాక్‌ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ పరమేంద్ర దోవల్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)