మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా !

Telugu Lo Computer
0


జోధ్‌పూర్‌ ప్రజలకు తాను ప్రథమ సేవకుడినని, గెహ్లాట్ జోథ్ పూర్ అభివద్ది కోసం మ్యాజిక్కులైనా చేస్తానని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ అన్నారు. కాగా అశోక్ గెహ్లాట్ ప్రొఫెషనల్‌ మెజీషియన్ల కుటుంబంలో జన్మించారు. 15వ శతాబ్దానికి చెందిన మెహ్రాన్ ఘర్ కోటను సందర్శించే పర్యాటకుల సౌకర్యార్థం కోసం కొత్తగా నిర్మించిన 'రావు జోధా మార్గ్‌' ప్రారంభోత్సవంలో సీఎం గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతం నుంచి నేను మొదటిసారిగా ఎంపీగా ఎన్నికయ్యాను. అప్పుడు జోధ్ పూర్ కు నీళ్లు లేవు, రైళ్లు లేవు. కానీ ఈ రోజు నీటి సరఫరా, విద్యుత్‌, రైళ్లు, రోడ్లు, విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చాను అంటూ చెప్పుకొచ్చారు. జోధ్‌పూర్‌పై ఎవరైనా అధ్యయనం చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో కచ్చితంగా తెలుసుకుంటారని అన్నారు. ఇలాంటి గొప్ప పట్టణానికి యునెస్కో వారసత్వ హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇంకా కృషి చేస్తాను. నిధుల కోసం అవసరమైతే మ్యాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చి అయినా సరే డబ్బులు సంపాదిస్తా. అంతేగానీ జోధ్‌పుర్‌ ప్రజలను నిరాశపరచను అంటూ స్పష్టంచేశారు. 'మ్యాజిక్‌' చేస్తానంటూ అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజస్ధాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషీ సెటైర్లు వేశారు. సీఎం తన పాలనలో కేవలం మ్యాజిక్కులు మాత్రమే చేస్తారు, అభివృద్ధి చేయరు అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి తమవిగా చెబుతున్నారని ఆరోపించారు. అంతేకాదు ప్రభుత్వ ఆఫీసుల కబోర్డ్స్ లో బంగారం, భారీగా నగదు దొరికాయి. అది మ్యాజిక్‌ కాకపోతే మరేంటీ? అంటూ సెటైర్లు వేశారు. కాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రముఖ ఇంద్రజాలికుడు లక్ష్మణ్ సింగ్ గెహ్లాట్ కుమారుడు. లక్ష్మణ్ సింగ్ దేశవ్యాప్తంగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చేవారు.

Post a Comment

0Comments

Post a Comment (0)