గీజర్‌ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీకవడంతో జంట మృతి

Telugu Lo Computer
0


బెంగుళూరులో సహజీవనం చేస్తున్న ఓ జంట స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి చనిపోయారు. చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌, బెళగావి జిల్లా వాసి సుధారాణి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఒకే హోటల్‌లో పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి ఊపిరాడక చనిపోయారు. స్నానం చేస్తుండగా గీజర్‌లోంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీకవడంతో చనిపోయారు. డ్యూటీ టైమ్‌ అయినప్పటికి ఇద్దరూ హోటల్‌కి రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టి చూడటంతో చంద్రశేఖర్, సుధారాణి ఇద్దరూ బాత్రూంలో విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.పోలీసులు సంఘటన స్తలాన్ని పరిశీలించిన తర్వాత గీజర్‌ లీకవడం వల్ల అందులోని కార్బన్ మోనాక్సైడ్ విష వాయువును పీల్చి చనిపోయినట్లుగాతేల్చారు. అయితే చనిపోయిన సుధారాణి, చంద్రశేఖర్‌ కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతలోనే ఈ విషాద సంఘటన జరిగింది. చనిపోయిన దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)