ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఓ శిక్షణ విమానం కర్ణాటక లోని చామరాజనగర్ సమీపంలో అది కుప్పకూలింది. అయితే, ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక మహిళా పైలట్ ఉన్నారు. వాయుసేన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 'రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన 'కిరణ్' శ్రేణి విమానం.. బెంగళూరులోని ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరింది. ఈ క్రమంలోనే చామరాజనగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అది కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు.. భూమిక, తేజ్పాల్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణకు ఆదేశించిన'ట్లు వాయుసేన తెలిపింది.
కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం
June 01, 2023
0
Tags