అతిగా ఆలోచించి అనారోగ్యానికి గురికావద్దు !

Telugu Lo Computer
0


పనిభారం మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి. చెడు ఆలోచనలు రావడం మొదలవుతాయి. ఏదైనా ఒక విషయం గురించి అనవసరంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. సమస్య పరిష్కారమైందా? లేదా? అనేది తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ అతిగా ఆలోచించే అలవాటు వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మానసికంగా, శారీరకంగా మరింత కుంగదీస్తుంది. ఏదైనా సమస్యతో ఇబ్బంది పడినప్పుడు, ఏదైనా అంశం గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు, కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిని భారీగా పెంచుతుంది. ఈ కారణంగానే మధుమేహ రోగులకు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేకంగా సలహా ఇస్తారు నిపుణులు. శరీరంలోని మొత్తం నాడీ వ్యవస్థ.. సమాచార బట్వడా వ్యవస్థలా పని చేస్తుంది. అయితే, అతిగా ఆలోచించడం, ఒత్తిడికి గురికావడం ద్వారా.. అదే సందేశం నరాలలో ప్రసారం చేయబడుతుంది. ఇది గుండె, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడితో బాధపడేవారు సులభంగా అనారోగ్యానికి లోనవుతారు. ఒక్కోసారి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడికి గురయితే.. రక్తపోటు పెరుగుతుంది. ఈ కారణంగా, ధమనిలో వాపు సంభవించవచ్చు. ఇది గుండెకు హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే, అతిగా ఆలోచించడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి, అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు రోజూ వ్యాయామం చేయడం, యోగాసనాలు వేయడం చాలా ఉత్తమం.

Post a Comment

0Comments

Post a Comment (0)