రైలు ఫుట్ బోర్డుపై జర్నీ చేసిన బామ్మ !

Telugu Lo Computer
0

ముంబైలో లోకల్ రైళ్లలో ఉండే రద్దీ తెలిసిందే. రోజూ తమ అవసరాల కోసం ముంబై వాసులు ఈ రద్దీని చేధించి రైలు ప్రయాణం చేస్తుంటారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరుచూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ముంబై లోకల్ ట్రైనుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. రైలు చాలా వేగంగా వెళ్తోంది. ఫుట్ బోర్డులో ఒక బామ్మ  రైలులో చోటు దొరకక వేలాడుతూ ప్రయాణిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‭గా మారింది. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఒకవైపు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి, మరొక వైపు సాధారణ రైళ్లలో దుస్థితి ఇదీ అంటూ విరుచుకుపడుతున్నారు. దేశంలో మొదటి రైలు ప్రారంభమై 160 ఏళ్లు అవుతోంది. ప్రభుత్వమేమో వందే భారత్ వంటి రైళ్లను తీసుకువస్తోంది. ఇప్పటికి ఉన్న రైళ్లలో ప్రయాణికుల అవస్థలు ఇవంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)