బస్సు పడి ఐదుగురి మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలోని గోపాల్ పురంలో గుర్తు తెలియని వావానాన్ని ఢీకొట్టిన పెళ్లి బృందంతో ప్రయాణస్తున్నబస్సు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారంతా ఓ పెళ్లికి హాజరైన తిరిగి వెళుతున్నారని పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)