ఢిల్లీలో భారీ దోపిడీ !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో భారీ దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. తుపాకీ గురిపెట్టి 1.3 కోట్ల డబ్బు, 2 కేజీల బంగారం తీసుకుని ఉడాయించారు. బాధితులలో తండ్రి కాంట్రాక్టరు కాగా కొడుకు ప్రేపర్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాడు. అర్ధరాత్రి తర్వాత ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు కిటికీల గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. తమతో పాటు తుపాకులు, కత్తులు తెచ్చుకున్న దొంగలు  ఇంట్లో వాళ్ళను నిద్రలేపి తుపాకులు, కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు. ఆ తరువాత అందినకాడికి డబ్బులు, బంగారం దొంగిలించి వెళ్ళిపోయారు. చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రాణాలతో మిగలరని హెచ్చరించి మరీ వెళ్ళారు. ఎలాగోలా కట్లు విడిపించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దొంగలు పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారమే దొంగతనం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి వద్దనున్న కొన్ని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం ఈ అనుమానాలకు బలం చేకూర్శాచుతోంది. బాధితులకు బాగా తెలిసిన వారే దొంగతనం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)