మమత బెనర్జీకి వివేక్‌ అగ్నిహోత్రి లీగల్‌ నోటీస్‌ !

Telugu Lo Computer
0


మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు 'ది కేరళ స్టోరీ' సినిమాను బ్యాన్‌ చేశాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ సినిమానుతృణముల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌  బ్యాన్‌ చేసింది. ఈ క్రమంలో సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీఎం మమతా బెనర్జీ సీరియస్‌ అయ్యారు. అందుకే కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేసినట్టు తెలిపారు. మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి సీరియస్‌ అయ్యారు. దీంతో, మమతకు లీగల్‌ నోటీస్‌ పంపించారు. తన 'కశ్మీర్ ఫైల్స్' సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్‌ నోటీస్‌ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. తాను తీసిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)