శరవేగంగా రామ మందిరం నిర్మాణ పనులు

Telugu Lo Computer
0


అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫొటోలను రామజన్మభూమి ట్రస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ మందిరం పైకప్పు పనులు దాదాపు 40 శాతం పూర్తయ్యాయని వెల్లడించింది. రామ మందిరం వడి వడిగా అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటోంది. జనవరి 22, 2024న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఏప్రిల్ 24న ప్రపంచంలోని ఏడు ఖండాలకు చెందిన 155 దేశాల నదుల నీరు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలోని రామలల్లా ఈ నీటితో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, వివిధ దేశాల రాయబారులు, ఎన్నారైలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)