వేధింపులు తాళలేక చెవి పోగులమ్మి భర్తను చంపించిన భార్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గోపాల్, పీరుబాయ్ దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరికి పెళ్లి అయ్యింది. అయితే, మద్యానికి బానిస అయిన గోపాల్ తన భార్య పీరు బాయిని నిత్యం వేధించేవాడు. దాంతో విసిగి వేసారిపోయిన పీరుబాయి తన భర్తను చంపించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను కలిసింది. తన బంగారు కమ్మలను అమ్మి సుపారీ గ్యాంగ్‌కు పీరుబాయి రూ. 2 లక్షలు ఇచ్చింది. హంతకులు చందర్, మహేష్ పక్కా ప్లాన్ వేసి, డొంకల్ అడవిలో గోపాల్‌ను కిరాతకంగా హత్య చేశారు. గత నెల 30న హత్య జరగగా, తాజాగా కేసును ఛేదించారు పోలీసులు. గోపాల్‌ను కట్టుకున్న భార్యే చంపించిందని తెలిసి పోలీసులుఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో హత్య చేసిన చందర్, మహేష్‌లను కూడా అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)