ఇంటికి తాళం వేసి తల్లిదండ్రుల్ని గెంటేసిన కుమారులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 23 May 2023

ఇంటికి తాళం వేసి తల్లిదండ్రుల్ని గెంటేసిన కుమారులు !


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో తల్లిదండ్రులను ఇద్దరు కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. తల్లిదండ్రులు సంపాదించిన పొలాన్ని తమ పేరిట రాయాలని ఒత్తడి చేశారు. వారు ఒప్పుకోకపోవడంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఆస్తికోసం ఆ వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేసి, ఇంటికి తాళం వేసుకున్నారు. పెద్ద కుమారుడు రామకృష్ణ నల్ల పాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పని చేస్తున్నాడు. అతని తమ్ముడు మల్లిఖార్జున రావు కూలీ పనులకు వెళ్తుంటాడు. కొడుకులుపెట్టే చిత్ర హింసలు భరించలేక వృద్ధ దంపతులు చివరకు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసమే చిత్ర హింసలు పెడుతున్నారని ఆ తల్లి వాపోయింది. తన పరిస్థితిని వివరించి బోరున విలపించింది. గ్రామస్థుల సహకారంతో గుడిసె వేసుకొని ఉంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఇద్దరు కొడుకుల బారి నుంచి తమను కాపాడాలని తల్లి ద్రండ్రులు గుళ్ళకమ్మ, శ్రీనివాస్ రావు వేడుకుంటున్నారు.

No comments:

Post a Comment