బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 6వ తేదీ నాటికి తుఫాన్గా మారుతుందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టనున్నారు. గత సంవత్సరం ఇదే మే నెలలో అసాని తుపాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. అయితే రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో భారీ మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
పొంచివున్న 'మోచా' తుఫాను
May 03, 2023
0
Tags