హైదరాబాద్లోని హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై జనంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు. రూ.10 వేల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తున్నది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని హైకోర్టు సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న మిథ్న్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైకోర్టు దగ్గర వ్యక్తి దారుణ హత్య
May 04, 2023
0
Tags