ఆస్ట్రేలియా చేరుకున్న మోడీ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 22 May 2023

ఆస్ట్రేలియా చేరుకున్న మోడీ


విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆస్ట్రేలియాకి చేరుకున్నారు. సిడ్నీవిమానాశ్రయంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులు ప్రధానికి స్వాగతం పలికారు. "భారత్ మాతా కీ జై" "వందేమాతరం" అని నినాదాలు చేశారు. ప్రధాని కోసం వచ్చిన ఓ వృద్ధ మహిళ ''సునో సునో ఏ దునియా వాలో భారత్‌కో బులాయా హై'' అనే పాటపాడి వినిపించగా ప్రధాని మోడీ ఓపిగ్గా విన్నారు. ప్రధానిని కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయుల పిల్లల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ వారితో మమేకమై ముచ్చటించారు. వారికి ఆశీస్సులు అందించారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనిస్తోతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఒప్పందంలో భాగంగా ట్రేడింగ్ వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల బలోపేతం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, భద్రత సహకారం సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రటకన విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న వాణిజ్యం, వృద్ధిని నడపడానికి ప్రధాని మోడీ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను కూడా కలవనున్నారు. భారతదేశంతో పెట్టుబడులు, ఆస్ట్రేలియా-భారత్ నుంచి అవకాశాలను వారితో చర్చించనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలోని భారతీయ ప్రవాసుల కమ్యూనిటీ ఉత్సవాల్లో ఇరు దేశాల ప్రధానులు పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. ఢిల్లీలో జరిగే జి-20 సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 

No comments:

Post a Comment