పశ్చిమబెంగాల్ లోని అసన్పోల్కు చెందిన కళాకారుడు సుశాంత్రాయ్రెండు నెలల పాటు శ్రమించి షారుఖ్ మైనపు బొమ్మను రూపొందించారు. పఠాన్ హిట్ కావడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరికి భిన్నంగా ఏదైనా చేయాలని అనుకుని షారుఖ్ మైనపు బొమ్మను తయారు చేశాడు. ప్రస్తుతం ఈ విగ్రహం అసన్ సోల్లోని ప్రైవేటు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. షారుఖ్ని కలిసినప్పుడు ఈ విగ్రహాన్ని కానుకగా ఇవ్వాలనుందని సుశాంత్ రాయ్ తెలిపారు. ఇటీవల విడుదలైన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించింది.
షారుఖ్ ఖాన్ మైనపు బొమ్మ తయారు చేసిన అభిమాని
May 05, 2023
0
Tags