షారుఖ్​ ఖాన్​​ మైనపు బొమ్మ తయారు చేసిన అభిమాని

Telugu Lo Computer
0


పశ్చిమబెంగాల్ లోని అసన్​పోల్​కు చెందిన కళాకారుడు సుశాంత్​రాయ్​రెండు నెలల పాటు శ్రమించి  షారుఖ్​ మైనపు బొమ్మను రూపొందించారు. పఠాన్​ హిట్​ కావడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరికి భిన్నంగా ఏదైనా చేయాలని అనుకుని షారుఖ్​ మైనపు బొమ్మను తయారు చేశాడు. ప్రస్తుతం ఈ విగ్రహం అసన్ సోల్​లోని ప్రైవేటు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. షారుఖ్​ని కలిసినప్పుడు ఈ విగ్రహాన్ని కానుకగా ఇవ్వాలనుందని సుశాంత్​ రాయ్​ తెలిపారు. ఇటీవల విడుదలైన పఠాన్​ ప్రపంచవ్యాప్తంగా షారుఖ్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమాలో షారుఖ్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొనే నటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)