యూపిఎస్‌సి ఛైర్మన్‌గా మనోజ్ సోనీ ప్రమాణస్వీకారం

Telugu Lo Computer
0


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా విద్యావేత్త మనోజ్ సోనీ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. గుజరాత్ లోని అంబేద్కర్ వర్శిటీ, బరోడా లోని సయ్యాజిరావు వర్శిటీలకు వీసీగా పని చేసిన ఆయన 2017 జూన్ 28న కమిషన్‌లో సభ్యునిగా చేరారు. ఛైర్మన్ హోదాలో 2022 ఏప్రిల్ 5 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కమిషన్‌లో సీనియర్ సభ్యులైన స్మితా నాగరాజ్ మంగళవారం మనోజ్‌చే ప్రమాణస్వీకారం చేయించినట్టు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. యూపిఎస్‌సిలో ఛైర్మన్, పదిమంది సభ్యులు ఉంటారు. అయితే ప్రస్తుతం ఐదుగురు సభ్యుల వేకెన్సీ ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)