పశ్చిమ బెంగాల్‌లో ఆరేళ్లుగా గుంతలోనే నివాసం !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌ జల్పాయ్‌గుడిలోని ఛాప్‌గఢ్‌ గ్రామంలో ఓ కుటుంబం ఆరేళ్లుగా గుంతలోనే నివసిస్తోంది. కనీసం తాగడానికి సరైన నీరు కూడా లేదు. వీరికి ఏ ప్రభుత్వ పథకం సైతం అందడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే లక్ష్మీ మోహన్‌ రాయ్‌కి పక్కా ఇల్లు లేదు. ఓ రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నాడు. వర్షం, తుపాను లాంటివి తలెత్తినప్పుడు ఇల్లు పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో మోహన్‌ రాయ్‌ కుటుంబం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో రేకుల షెడ్డులోనే ఓ గుంతను తవ్వి భార్యాభర్తలు సహా ఇద్దరు బాలికలు, అత్త ఐదుగురు అందులో తల దాచుకుంటున్నారు. ఇంటి సమీపంలోనే ఓ చిన్న బావిని తవ్వుకుని ఆ నీటినే తాగుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)