ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 2023 సీజన్ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖతార్లోని దోహా వేదికగా జరిగిన 2023 డైమండ్ లీగ్ జావెలిన్ త్రో విభాగంలో తొలి ప్రయత్నంలోనే 88.67 మీటర్లు ఈటెను విసిరి ఔరా అనిపించాడు.మొత్తం ఈ విభాగంలో 10 మంది పోటీపడగా నీరజ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే అందరికంటే ఎక్కువ దూరం ఈటెను విసిరి డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో విజేతగా నిలిచాడు. గతేడాది డైమండ్ లీగ్ ఫైనల్ ట్రోఫీని చేజిక్కించుకున్న నీరజ్.. తొలి భారతీయుడి చరిత్ర సృష్టించాడు. అదే ఉత్సాహంతో దోహా వేదికగా జరుగుతున్న 2023 డైమండ్ లీగ్లోనూ తన సత్తా చాటాడు. ఆగస్టు 2022లో లౌసాన్లో విజయం తర్వాత.. గతేడాది జ్యూరిచ్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ విజయం సాధించాడు. డైమండ్ లీగ్లో అగ్రస్థానంలో నిలవడం ఇది రెండోసారి.
సత్తా చాటిన నీరజ్ చోప్రా !
May 06, 2023
0
Tags