తల్లిదండ్రుల్ని, అమ్మమ్మను హాకీ స్టిక్‌తో కొట్టి చంపాడు !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌ లోని మహాసమండ్ జిల్లా పుత్కాలో ఉదిత్ భోయ్ అనే 24 ఏళ్ల వ్యక్తి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం తల్లిదండ్రుల్ని వేధిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే  తల్లిదండ్రులతో డబ్బు కోసం గొడవ పడ్డాడు. వారు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో తల్లిదండ్రులు, అమ్మమ్మను హాకీ స్టిక్‌తో కొట్టి చంపాడు. ఇంటి వెనుక చెక్కదుంగలు, శానిటైజర్ ఉపయోగించి మృతదేహాలను కాల్చేశాడు. చేసిన నేరం కప్పి పుచ్చుకునేందుకు ఉదిత్ తన తండ్రి ఫోన్ నుంచి బంధువులకు మెసేజ్‌లు పంపాడు. వైద్య చికిత్స కోసం రాయ్ పూర్ వెళ్లిన తన తల్లి జర్నా, తండ్రి ప్రభాత్ భోయ్, అమ్మమ్మ సులోచన కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాయ్‌పూర్‌లో చదువుకుంటున్న ఉదిత్ తమ్ముడు గ్రామానికి వచ్చాడు. తమ ఇంటి వెనుక ఉన్న కూరగాయల తోటలో బూడిదతో పాటు, గోడలపై రక్తపు మరకలు, ఎముక శకలాలు కనిపించడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉదిత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. విచారణలో ఉదిత్ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)