జమ్మూ కాశ్మీర్లో వరసగా బుధవారం నుండి ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపగా, గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం కూడా మరో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా శుక్రవారం ఉదయం రాజౌరీ జిల్లాలో ఎదురు కాల్పులు జరగగా, ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు రాజౌరీ జిల్లా బన్యారీ హిల్స్లోని డోకల్లో గాలింపు చేపడుతున్నారు. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో .. ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు జమ్ము జోన్ కి చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) ముఖేష్ సింగ్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ !
May 05, 2023
0
Tags