ఉపాసన పోస్ట్ వైరల్ !

Telugu Lo Computer
0


ఉపాసన మదర్స్ డే సందర్భరంగా తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ వేసింది. ఆ పోస్ట్ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 'సరైన సమయంలో నేను మాతృత్వాన్ని స్వీకరించినందుకు గర్వపడుతున్నాను. సమాజం కోసం లేదా మా వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో నేను నా బిడ్డకు జన్మని ఇవ్వాలని అనుకోలేదు. నా బిడ్డకు ప్రేమ, సంరక్షణను అందించడానికి నేను మానసికంగా సిద్ధమైనప్పుడే జన్మనివ్వాలని నిర్ణయించుకున్నా' అంటూ ఉపాసన రాసుకొచ్చింది. తమ మొదటి బేబీ గురించి అనౌన్స్ చేయడానికి ముందు చరణ్ అండ్ ఉపాసన ఎన్నో విమర్శలు ఎదురుకుంది. వాటన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఈ పోస్ట్ ఉండడంతో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)