మహారాష్ట్ర, అకోలా పట్టణంలోని పాత బస్తీలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. చిన్న వివాదం కాస్త ముదిరి రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు వాహనాలు ధ్వంసం చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ విధించినట్లు అకోలా కలెక్టర్ నీమా అరోరా పేర్కొన్నారు. నిరసనకారుల గుంపు పలు వాహనాలను ధ్వంసం చేసిందని, వివాదస్పద ఘటన తర్వాత పాతబస్తీ పోలీస్ స్టేషన్ ఎదు జనం గుమిగూడారని అధికార వర్గాలు తెలిపారు. ఓ గుంపు వాహనాలే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అకోలాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట అకోట్ ఫైల్ ప్రాంతంలో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
అకోలాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ !
May 14, 2023
0
Tags