అరేబియన్ సముద్రంలో కేరళ తీర ప్రాంతం కొచ్చి కోస్తా ఆవలి ప్రాంతంలో రూ.12 వేల కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సముద్ర తీరం వెంబడి డ్రగ్స్ రవాణా జరుగుతుందని 15 రోజుల క్రితం సమాచారం అందింది. ఈ మేరకు నార్కోటిక్స్ నియంత్రణ విభాగం (ఎన్సీబీ), భారత నేవీ సంయుక్తంగా జరిపిన ఈ దాడిలో అరేబియన్ సముద్రంలో ఇరాక్ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా నౌకలో రవాణా అవుతున్న 2500 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు. నౌకలో ఉన్న పాకిస్థాన్కు చెందిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఇంతకుముందెప్పుడూ ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. 134 బస్తాల మెథాంఫేటామిన్ను సీజ్ చేశామని, పాకిస్థాన్, ఇరాన్ మధ్య ఉన్న మక్రాన్ తీరంలో మదర్షిప్ అనే పెద్ద నౌక చిన్న చిన్న ఓడల ద్వారా అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తోందని ఆ అధికారి వెల్లడించారు. ఆపరేషన్ సముద్రగుప్తలో భాగంగా ఈ భారీ అక్రమ రవాణాకు చెక్ పెట్టామన్నారు.
కేరళ తీరంలో రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత
May 14, 2023
0
Tags