మనీష్ సిసోడియాపై 2 వేల పేజీల అనుబంధ చార్జ్ షీట్ దాఖలు !

Telugu Lo Computer
0


ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ 2 వేల పేజీల అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసింది. మరో వైపు ఈడీ అరెస్ట్ కేసులో బెయిల్ కోసం సిసోడియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల మూడో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ ఇందులో సంచలన విషయాలు చెప్పింది. లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని ఆరోపించింది ఈడీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత తమ బినామీల ద్వారా వ్యాపారం చేశారని తెలిపింది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా కవిత భూములు కొనుగోలు చేశారని చెప్పింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన జ్యూడిషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)