ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్ పాఠశాల యాజమాన్యం .ఏప్రిల్ 30న జరిగిన ప్రధానమంత్రి మన్ కీ బాత్ స్పీచ్ వినలేదని విద్యార్థులకు రూ.100 ఫైన్ వేసింది. జరిమానా చెల్లించకుంటే మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలని నోటీసులు ఇచ్చి మరీ ఒత్తిడి చేస్తోంది. విద్యార్ధులకు జరిమానా విధిచడం ఏమిటంటూ విద్యార్థుల తల్లితండ్రలు మానవ హక్కుల సంఘం నేతలను ఆశ్రయించారు. ఈ విషయంపై స్పందించిన సంఘం అధ్యక్షుడు విద్యార్ధులకు విధించిన ఫైన్ గురించి తెలుపుతూ ఆరిఫ్ ఖాన్ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి లేఖ రాశారు. అంతే కాదు స్కూల్ యాజమాన్యం విద్యార్ధులకు పంపిన నోటీసుల స్క్రీన్ షాట్స్ ను షేర్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై హయ్యర్ అఫీషియల్స్ చర్యలు తీసుకోవాలని ఆరిఫ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు , జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ ఆఫ్ డెహ్రాడూన్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వని పక్షంలో విద్యార్ధుల నుంచి డబ్బును వసూలు చేసినట్లు భావించి తదనుగునంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మన్ కీ బాత్ వినలేదని విద్యార్ధులకు రూ.100 జరిమానా !
May 06, 2023
0
Tags