టీడీపీ, వైసీపీ మధ్య ముదురుతున్న ఫ్లెక్సీ వార్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. అయితే బాబు చేపట్టిన 'ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి' టూర్‌ను నిరసిస్తూ వైసీపీ కూడా పోటీగా ఫ్లెక్సీలు పెట్టడంతో నిన్నటి నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ డిమాండ్‌ చేయడంతో అధికారపార్టీ శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. దీంతో పోలీసులు రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. అయితే సమస్య శ్రుతి మించడంతో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ కార్యకర్తలతో కలిసి రోడ్లపైకి వచ్చారు. టీడీపీ ఫ్లెక్సీలు మళ్లీ ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ టెన్షన్‌ నెలకొంది. ఫ్లెక్సీలు తీసేయాలని పోలీసులు ఆదేశించారు. ప్రధాన సెంటర్లలో పోలీసులు పెద్ద సంఖ్యలోనూ మోహరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)