మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంటున్న 34 ఏళ్ల మహిళ బ్యూటీపార్లర్కు వెళ్లాలనుకుంది. అందుకు భర్త అంగీకరించకపోగా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి భర్త విచారణలో తాను బ్యూటీపార్లర్కు వెళ్లకుండా అడ్డుకోవడంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి అయిన తదనంతరం అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తామని పోలీసు అధికారి యాదవ్ తెలిపారు.
బ్యూటీపార్లర్కు వెళ్లనివ్వలేదని ఉరివేసుకుంది !
April 29, 2023
0
Tags