లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద నీళ్లల్లో ఆగిన సిటీ బస్సు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం తెల్లవారుజాము నుంచి కుండపోత వానతో వణికిపోయింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాలు అన్నీ మునిగిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ శివార్లలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు వచ్చింది చేరింది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేని ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్ అదే వేగంలో ముందుకొచ్చేశారు. సరిగ్గా బ్రిడ్జి కిందకు రాగానే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి.. బస్సు సగం మునిగిపోయింది. ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లటంతో బస్సు ఆగిపోయింది. బ్రిడ్జి మధ్యలో బస్సు ఆగిపోవటం.. బస్సులోకి నీళ్లు రావటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే బస్సులో నుంచి బయటకు దిగి నడుం లోతు నీటిలో నడుస్తూ బయటకు వచ్చారు. బస్సు డ్రైవర్ నీటి లోతును అంచనా వేయకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)