ప్రముఖ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి (53) గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు జాని రేణిగుంట అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చక్రవర్తి 1997 రాశి అనే సినిమాతో నిర్మాతగా కోలీవుడ్ చిత్ర పరిశ్రకు పరిచయం అయ్యారు. అయన నిర్మాతగా కోలీవుడ్లో హీరో అజిత్తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే సినిమాలను తెరకెక్కించారు. ఆయన కేరీర్లో ఎక్కువ సినిమాలను హీరో అజిత్తో చేశాడు. శింబు నటించిన కాలై, వాలు సినిమాలను కూడా నిర్మించాడు. ఆయన మృతికి పలువురు అగ్ర హీరోలు సంతాపం తెలియజేశారు.
ప్రముఖ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి మృతి
April 29, 2023
0
Tags