తండ్రిని మిల్లుకు యజమానిని చేసిన కుమారుడు !

Telugu Lo Computer
0


రాజస్థాన్​ లోని చురు కు చెందిన 22 ఏళ్ల యువకుడు హిమాన్షు సోషల్​ మీడియా ద్వారా సంపాదించిన డబ్బుతో తండ్రికి సొంత మిల్లు ఏర్పాటు చేయించి స్ఫూర్తిగా నిలిచాడు. టీ అమ్మే వ్యక్తి కొడుక్కి స్మార్ట్​ ఫోన్​ అంటే ఓ కల. హిమాన్షు తాను 12వ తరగతిలో ఉన్నప్పుడు మంచి మార్కులు వస్తే ఫోన్​ కొనిస్తానని తన తండ్రి మాట ఇచ్చాడు. అప్పుడే హిమాన్షు మంచి మార్కులతో ఇంటర్​ పాస్ అయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం తండ్రి అతనికి మొబైల్​ కొనిచ్చాడు. అప్పటినుంచి హిమాన్షు సోషల్​ మీడియాని లోతుగా అర్థం చేసుకున్నాడు. ఇన్​స్టాగ్రామ్​లో డాక్టర్ ఏపీజే అబ్దుల్​ కలాం అభిమాని పేరు మీద అకౌంట్​ క్రియేట్​ చేశాడు. అందులో మోటివేషనల్​ పోస్ట్​లను షేర్​ చేసేవాడు. మరో అకౌంట్​ హెల్త్​ నాలెడ్జ్​ పేరిట ఉంది. మొదటి అకౌంట్​కు 1.9 మిలియన్లు, రెండో అకౌంట్​కి 8.5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ప్రమోషన్ల పేరిట అతనికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈ రెండు అకౌంట్ల నుంచి అతను నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి లక్షలు అర్జిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న హిమాన్షు తన తండ్రితో మిల్లు పెట్టించడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చిందని ఉప్పొంగిపోతున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)