పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ ?

Telugu Lo Computer
0


ఢిల్లీలో ట్యాక్సీ, ఫుడ్‌ డెలివరీ కంపెనీలు తప్పని సరిగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వినియోగించాలని  ఆప్‌ సర్కార్‌ తెలిపింది. పెట్రోల్‌,డీజిల్‌ వాహనాల వినియోగాన్ని నిలిపివేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా వెహికల్‌ పాలసీని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ట్రాన్స్‌ పోర్ట్‌ మినిస్టర్‌ కైలాష్‌ గెహ్లట్‌ మాట్లాడుతూ ఢిల్లీలో క్యాబ్‌, ఈకామర్స్‌ కంపెనీలు 2030 ఏప్రిల్‌ 1 నాటికల్లా ఎలక్ట్రిక్‌ వాహనాల్ని వినియోగించాలి. ఇందు కోసం వెహికల్స్‌ పాలసీ అమలు చేస్తున్నాం. ఈ పాలసీని ట్రాన్స్‌పోర్ట్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు ఆమోదించాల్సి ఉంది. అనంతరం కొత్త వెహికల్‌ రూల్‌ను అమలు చేస్తామని అన్నారు. కొత్త పాలసీలో అగ్రిగేటర్లు ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్స్‌లను మాత్రమే నడిపేందుకు అనుమతిస్తారు. తద్వారా రవాణ రంగానికి  మరింత ఊతం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. అందుబాటు ధరల్లో నగరం అంతటా ప్రభుత్వం మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం అమలు కోసం దఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శలవారీ ప్రణాళికను రూపొందించారు. ఉదాహరణకు, నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోపు అగ్రిగేటర్‌లు 5 శాతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఉండాలి. తొమ్మిది నెలల్లో 15 శాతానికి, ఒక సంవత్సరం ముగిసే నాటికి 25 శాతానికి, రెండేళ్లు ముగిసే నాటికి 50 శాతానికి, మూడేళ్లు ముగిసే నాటికి 75 శాతానికి, నాలుగు చివరి నాటికి 100 శాతానికి పెంచనున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, 2030 ఏప్రిల్ 1 నాటికి ఢిల్లీలోని మొత్తం వాణిజ్య వాహనాలు ఈవీలుగా మారనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)