ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏఆర్టీ జ్యూవెలరీ సంస్థ లక్ష రూపాయలు కడితే వారానికి రూ.3,000లు వడ్డీ ఇస్తామని ప్రకటించింది. లక్ష రూపాయలకు వారానికే రూ.3వేలు వడ్డీ వస్తుంది కదా అంటూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, రూపాయి రూపాయి పొదుపు చేసుకున్నవారు చాలామంది సదరు జ్యూవెలరీ షాపు యజమాని వలలో పడ్డారు. భారీగా డిపాజిట్టు కట్టారు. అలా రూ. కోట్లు పట్టుకుని జ్యూవెలరీ షాపు యజమాని మాయం అయిపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మాకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఏఆర్టీ జ్యూవెలరీ షాపు యజమాని విజయ కోసం గాలిస్తున్నారు. రూ.లక్ష కడితే వారానికి రూ.3వేలు వడ్డీగా ఇస్తానని ఏడాది తరువాత అసలు పూర్తిగా ఇచ్చేస్తానంటూ ప్రకటించాడు. అంతేకాదు డిపాజిట్టు కడితే అదనంగా నగదు చెల్లిస్తానని చెప్పాడు. అలా పలువురు రూ. 10కోట్లు వరకు ఏఆర్టీ షాపు యజమానికి కట్టారు. ఆ తరువాత ఇంకేముంది కట్టిన డబ్బులకు వడ్డీ ఇవ్వాలని కోరారు. కానీ కాలయాపన చేస్తూ డబ్బులు ఇవ్వకుండా దాట వేశాడు.కానీ డబ్బులు కట్టినవారు మాత్రం ఒత్తిడి చేయగా బోర్డు తిప్పేసి పారిపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఏఆర్టీ యజమాని విజయ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బోర్డు తిప్పిన ఏఆర్టీ జ్యూవెలరీ !
April 08, 2023
0
Tags