బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి చలించి పోయిన ఐపీఎస్ అధికారి !

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని  దుర్గ్‌ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌కి వీధిలో బెలూన్‌లు అమ్ముతున్న ఓ బాలుడు కనిపించాడు. అతని దగ్గరకు వెళ్లి చదువుకునే వయసులో బెలూన్లు ఎందుకు అమ్ముతున్నావని ప్రశ్నించారు. బెలూన్ల వ్యాపారం ఎలా ఉందని, వాటి ధర ఎంతని వివరాలు అడిగారు. ఎంతో అమాయకంగా సమాధానం చెబుతున్న అతని కష్టం చూసి ఆ ఆఫీసర్ కి మనసు కదిలిపోయింది. అంతే అతనికి సాయం చేయాలి అనుకున్నారు. బాలుడి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కొనేసి అతడికి ఆనందం పంచారు. ఆయన చేసిన పని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు అభిషేక్ పల్లవ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి వారి వల్ల దేశంలో పరిస్థితులు మారతాయి అని కొందరు.. మీరు చేసిన మంచి పనికి దేవుడు మీకు తోడుంటాడు అని కొందరు.. ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ పల్లవ్ పై అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)