పంజాబ్‌లో రైతుల రైల్‌ రోకో !

Telugu Lo Computer
0


రోడ్డు ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమికి మెరుగైన పరిహారంతో పాటు అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని కోరుతూ పంజాబ్‌లో రైతులు పోరుబాట పట్టారు. గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్‌సీ) ఆధ్వర్యంలో రైతులు రైల్ రోకో చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో టెంట్లు ఏర్పాటు చేసిన రైతులు రైలు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సరైన పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కేఎంఎస్‌సీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్నదని, బాధిత రైతులందరికీ ఎకరాకు రూ. 50,000 పరిహారం చెల్లించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గోధుమల సేకరణ కోసం నిబంధనలను సడలించాలని కోరారు. వ్యవసాయ రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయాలని, రైతులకు ఊరట ఇచ్చేలా ఆరు నెలల పాటు వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వాటిల్లిన పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే అంచనాలు రూపొందించి వీలైనంత త్వరలో రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)