నేటి నుంచి గంగా పుష్కరాలు !

Telugu Lo Computer
0


బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు (మేష రాశిలో గురు సంక్రమణం) గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 ఏండ్ల తర్వాత నేటి నుంచి గంగా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అలహాబాద్‌, గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ సంగమం ప్రయాగ నగరాలలో పుష్కరాల సంరంబం ఆరంభమవుతున్నది. పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరిస్తే సకల పాపాల నుంచి విముక్తమవుతామని ప్రతీతి. ఈ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారని చెప్తారు. రోజుకు 25 లక్షల దాకా జనం గంగా స్నానం ఆచరిస్తారు. కనీసం కోటి మంది నిత్యం పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటుంటారు. గంగానది పుట్టింది మొదలు సముద్రంలో కలిసే దాకా ప్రతీది భారతీయులకు పవిత్రం. గంగా ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. మరెన్నో సామ్రాజ్యాలు వెలిశాయి. గంగానదికి చాలా పేర్లున్నాయి. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అంటారు. జహ్ను పొట్టంలోంచి పుట్టింది కాబట్టి జాహ్నవిగా కూడా పిలుస్తారు. భారతీయులు ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే గంగా ప్రధానమైనది. కాశీనాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసి క్షేత్రంలో గంగాపుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలోకి మణికర్ణిక ఘాట్‌ ముఖ్యమైనది. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పడు అంటే 2023, మే 3న గంగానది పుష్కరాలు ముగుస్తాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)